నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని కన్నాపూర్ తాండ, గోకుల్ తాండ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం పోడు భూమి రైతులకు పట్టాలు అందజేయడానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు జాజాల సురేందర్ రానున్నట్లు, లబ్ధిదారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని గ్రామ సర్పంచులు చందర్ నాయక్, లలితా లింబాద్రి నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.