నవతెలంగాణ- మోపాల్: మోపాల్ మండలంలోని బోర్గం గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయన్ని గురువారం ఉదయం రూరల్ ఎం ఎల్ ఏ బాజిరెడ్డి గోవర్ధన్, కూడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి తో కలిసి పార్టీ జెండా ను ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించరు. అనంతరం గ్రామానికి చేందిన యువకులు పార్టీ లో చేరారు. వారికీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ కచ్చితంగా బోరింగ్ గ్రామస్తులందరూ మీకు మద్దతుగా ఉంటారని ఈసారి రూరల్ నియోజకవర్గంలో గోవన్న గెలుపును ఎవరు ఆపలేరని ఆయన తెలిపారు. యువకులను ఉద్దేశించి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ యువకులు పార్టీ లో చేరడం సంతోషాకరమణి భారీ మెజారిటీ తో బీఆర్ఎస్ పార్టీ ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ చంద్ర శెకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.