నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక లోని చిన గంట్యాడ శ్రీనివాస నగర్ కు చెందిన కోసనం భాస్కర్ రావు బాబీ అనే యువకుడు AVK డిగ్రీ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అలానే జెమీమా అనే యువతి విజయవాడ కాలేజ్ లో నీట్ కి ప్రిపేర్ అవుతుంది. అయితే గత కొంత కాలంగా బాబీ, జెమీమా ప్రేమలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో జెమీమా తనని పెండ్లి చేసుకోమని కోరింది. అందుకు బాబీ నిరాకరించారు. దీనితో ఆ యువతి అట్రాసిటీ కేసు పెడతానని బాబీని వారం రోజుల నుండి బెదిరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భయానికి లోనైన బాబీ విషం తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. దీనితో జెమీమా బెదిరింపుల కారణంగానే బాబీ డిప్రెషన్ లోకి వెళ్లి దీపావళి రోజు పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడని బంధువుల ఆరోపిస్తున్నారు. అలానే తమ కొడుకు మరణానికి జెమీమా అనే యువతి కారణం అని బాబీ తల్లిదండ్రులు జెమీమా పైన గాజువాక పోలీసులకు కంప్లైంట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.