– ఇంటింటి ప్రచారంలో గార్డుల రజిత లింగరాజు
నవతెలంగాణ- నూతనకల్: నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గాదరి కిషోర్ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీటీసీ గాడ్దుల రజిత లింగరాజ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రపాడు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలన్న నూతన పథకాలు అమలు కావాలన్నా రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపొందాలని నియోజకవర్గంలో కిషోర్ ని గెలిపించి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను మూడవసారి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి కనకట మహేష్ గౌడ్ మహేష్ ఇరుగు సందీప్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు