నవతెలంగాణ – హైదరాబాద్: కేసీఆర్ మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ప్రచారానికి హాజరు అయ్యారు. ఈ సభలో చాలా ఆసక్తికరంగా కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా అదే సభకు హాజరు అయిన వారిలో అస్లాం అనే వ్యక్తి దగ్గర రెండు బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆ బుల్లెట్లను స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని విచారణ చేస్తున్నారు. అస్సలు ఈ బుల్లెట్ల వెనుక కారణం ఏమిటి అన్నది బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ సంఘటనతో కేసీఆర్ తో పాటుగా ఇతర స్థానిక నేతలు మరియు అభిమానులు భయాందోళనకు గురయ్యారు.