![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230716-WA0326-300x135.jpg)
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ అనుబంధ విభాగాల బాధ్యులను నియమించింది.ఈ క్రమంలో వారి నియామకాల పత్రాలను ఆదివారం సంబంధిత బాధ్యులు అందజేసారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ గా బూసి పాండు రంగా,కో – కన్వీనర్ గా కందుల వెంకటేశ్వరరావు,ఎస్సీ సెల్ మండల కన్వీనర్ లు గా చల్లా రమాదేవి,మొద్దు మరియమ్మ, ఎస్సీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కొలికపోగు వెంకటలక్ష్మి, మందపాటి నాగలక్ష్మి, మందపాటి వజ్రమ్మ లకు ఎస్సీ సెల్ ములకలపల్లి మండల అద్యక్షులు పాలకుర్తి రవి చేతుల మీదుగా అందజేసారు. ఈ సందర్భంగా పార్టీ మండల అద్యక్షులు చెన్నకేశవరావు మాట్లాడుతూ పీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి,మధిర శాసనసభ్యులు బట్టి విక్రమార్క ఆదేశాలు మేరకు జిల్లా అధ్యక్షులు,భద్రాచలం శాసనసభ్యులు పోదేం వీరయ్య సహకారంతో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరాల రవికుమార్ పర్యవేక్షణలో ఎంపికలు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బానోత్ దంజు నాయక్,మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా, ఎంపీటీసీ లు వేముల భారతి ప్రతాప్,సత్యవరపు తిరుమల బాలగంగాధర్,స్థానిక నాయకులు జూపల్లి ప్రమోద్,నండ్రు రమేష్ తదితరులు పాల్గొన్నారు