నవతెలంగాణ-ములుగు
సజావుగా ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అభ్య ర్థులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్ వీడి యో సమావేశం మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీల కులు సవిన్ బన్సల్, ఎన్నికల పోలీస్ పర్యవేక్షకులు అంజన్ చక్రబోర్తి, ఎన్నికల వ్యఎన్నికల సాధారణ పరిశీలకులు సవిన్ బన్సల్య పరిశీలకులు వాగీష్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పి గౌస్ ఆలం, రిటర్నింగ్ అధికారి అంకిత్ తో కలసి పోటీ చేసే అభ్య ర్థులతో సమావేశం నిర్వహించారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నామి నేషన్ల ఉపసంహరణ తర్వాత మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారని, ఒక బ్యాలెట్ యూనిట్ల వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను కట్టు దిట్టంగా కేటా యించిన రిజిస్టార్లలో నమోదు చేయాలని, వీటిని ఎన్నికల పరిశీలకులు పరిశీలిస్తారని అన్నారు. నవంబర్ 21 నుంచి 23 వరకు జిల్లాలో ఎన్నికల పరిశీల కులు పర్యటించి అభ్య ర్థుల ఎన్నికల వివరాలు పరిశీలిస్తామన్నారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా అభ్యర్థుల ఖర్చులు పరిశీలిస్తారని అన్నారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధి 303 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ల వివరాలను త్వరి తగతిన అందించాల న్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయ వచ్చని అన్నారు. ములుగు నియోజకవర్గ ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులు 8500275774,8500275692, 87126 70126లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ సమావేశంలో ములుగు తహసిల్దార్ విజయభాస్కర్, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.