నవతెలంగాణ-భూపాలపల్లి
ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ సజావుగా ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అభ్యర్థులు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. గురువారం రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధి కారి భవేష్ మిశ్రా భూపాల్ పల్లిలో పోటీ చేసే అభ్య ర్థులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా భవేష్ మిశ్రా మాట్లాడుతూ… భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారని, రెండు బ్యాలెట్ యూనిట్ల వినియోగిస్తామని అన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల ను కట్టుదిట్టంగా కేటాయించిన రిజిస్టార్లలో నమోదు చే యాలని, వీటిని ఎన్నికల పరిశీలకులు పరిశీలిస్తారని, నవంబర్ 21 నుంచి నవంబర్ 23వరకు జిల్లాలో ఎన్ని కల పరిశీలకులు పర్యటించి అభ్యర్థుల ఎన్నికల వివ రాలు పరిశీలించినట్టు అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ము గిసిన తర్వాత కూడా అభ్యర్థుల ఖర్చులు పరిశీలిస్తున్న ట్టు తెలిపారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ప రిధి 317 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ల వివరాలను త్వరితగతిన అందించా లని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అన్నారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుందన్నారు. కౌంటింగ్ కోసం సైతం టేబుల్ కి ఒక్కరు చొప్పున డిసెంబర్ ఒకటి వరకు కౌంటింగ్ ఏజెంట్ వివరాలు అందించాలని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. జనరల్, పోలీస్, ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్లు అభరు నందన్ అంబస్థ, అమిత్ కుమార్ కౌశిక్ రాయి, ఆర్డీఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.