నవతెలంగాణ- వేములవాడ: గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా గురువారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు కూతురు నిహారిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానిక సర్పంచ్ కటకం మల్లేశంతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఆమె మహిళలను, చిన్నారులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించుకుంటూ, ఎన్నికల మేనిఫెస్టోను చూపించుకుంటూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, అందరికి అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందాలన్నా మళ్ళీ ఒకసారి కారు గుర్తుకే ఓటు వేయాలని, అభివృద్ధి చేయాలనే ఆశయంతో వస్తున్న చల్మెడను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వారి వెంట స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.