నవతెలంగాణ-హైదరాబాద్ : చంద్రయాన్-3 ల్యాండింగ్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ అద్భుతాన్ని తెలంగాణలోని ప్రతీ విద్యార్థి చూడాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలలో లైవ్ స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ విద్యా ఛానెల్స్ టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చూపిస్తామని చెప్పారు. సాయాత్రం 5.20కి టీశాట్, నిపుణ ఛానెళ్లలో లైవ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6.04గంటలకు ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్ కానుంది. సాధారణంగా స్కూళ్లు 4.45కు ముగుస్తాయి. కానీ లైవ్ కారణంగా రేపు ఆలస్యంగా ముగియనున్నాయి.