నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యల తీరు హంతకుడే సంతాపం తెలిపినట్టు ఉందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్ రావు తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం …దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో యువకులు బలిదానం చేశారని తెలిపారు. నెహ్రూ ప్రభుత్వం తాత్సారం కారణంగానే పొట్టి శ్రీరాములు చనిపోయారని చెప్పారు. అప్పటికే హైదరాబాద్ అనేది ఒక రాష్ట్రంగా ఉందనే విషయాన్ని చిదంబరం మరిచిపోయారని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎంతో బాగుందని తెలిపారు.