– పెనుబల్లి మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
– కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-ఖమ్మం : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను పెనుబల్లి మండలం వియం బంజార గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొని గిరిజన నాయకుడు పోరాటయోధుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. అడవినే నమ్ముకుని జీవించే నిష్కల్మష హృదయయులైన ఆదివాసి గిరిలో సంక్షేమ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని దేశానికి ఆదర్శంగా తెలంగాణలో ఆదివాసి అభివృద్ధి కారణచర్లకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. అందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. విగ్రహ దాత గౌరారం గ్రామ సర్పంచ్ కాకా రుద్రజారాణిని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్యవినీల్, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్ రావు, కొమరం భీం, సంఘ బాధ్యులు కొర్సా గంగాధర్, కాక వెంకటేశ్వర్లు, పద్దం తిరుపతిరావు, కాక సీతారాములు, సర్పంచులు పద్దం వెంకటేశ్వరరావు, కాక రుద్రజ రాణి, మందడపు అశోక్ కుమార్, తేజావత్ తావు నాయక్, ఎంపీటీసి ఇర్పా రమణ, అఖిలపక్ష నాయకులూ చలామల విఠల్, కాటినేని శ్రీనివాస్, తెల్లం సురేష్,ఆదివాసీ యూత్ పెనుబల్లి మండలం కొర్సా గంగాధర్ ,కొర్సా బుచ్చలు ,పద్ధo తిరుపతి రావు, తెల్లం సురేష్ ,కారం వెంకటేశ్వర రావు కారం ముకేశ్ , సరియం నాగేశ్వరరావు ,యాసం సైదులు అన్ని గ్రామాల ఆదివాసీ నాయకులు మండల బి.ఆర్.యస్ నాయకులూ కానగల వెంకటరావు, చెక్కిలాల లక్ష్మణరావు, చింతనిప్పు సత్యనారాయణ, భూక్యా ప్రసాద్, పసుమర్తి వెంకటేశ్వరరావు, భద్రారెడ్డి, వంగ నిరంజన్ గౌడ్, యలమర్తి శ్రీను, చంటి, వెంకీ, లగడపాటి శ్రీను, పోతురాజు, తాళ్లూరి శేఖర్ రావు, శ్రీను తదితరులున్నారు.