నవతెలంగాణ -పెద్దవూర
మండలం లోని చలకుర్తి గ్రామం లో అంగన్వాడీ కేంద్రం 01 సెంటర్లో మంగళవారం జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా
అంగన్వాడీ టీచర్ యాదమ్మ మాట్లాడుతూ.. బాలలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో నిండిన పదార్థాలను అందింస్తున్నామన్నారు. సర్పంచ్ లలిత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లలో అంగన్వాడీ కార్యకర్తలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. గర్భిణీలు ఏ విధంగా పౌష్టికాహారం తీసుకోవాలో మూడు పూటలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో అంగనివాడి ఆయాలు, గర్భనులు, బాలింతలు, విద్యార్థులు ఉన్నారు.