![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230725-WA0198.jpg)
– చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ నాయకులు సురేష్ గొండ
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు వివిధ గ్రామాల గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కారం కావాలని 20వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులందరూ చెవిలో పువ్వు పెట్టుకొని తమ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ కార్మిక సంఘం నాయకులు సురేష్ గొండ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రామపంచాయతీ కార్మికులకు మద్దతుగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ పంచాయతీ కార్మికులకు మద్దతు తెలుపుతూ కార్మికులతో సహా చెవిలో పువ్వు పెట్టుకొని మద్దతు తెలిపినారు. సురేష్ గొండ మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకు గ్రామపంచాయతీ కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి రోజువారి నిరసన కార్యక్రమం చేపడుతూ ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాడాలని మీ న్యాయమైన పోరాటానికి సీఐటీయూ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన కార్మికులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఎం తులసీరామ్, కార్యదర్శి. జై మారుతి, ఉపాధ్యక్షురాలు. సరూప, కార్మిక నాయకులు, మారుతి, రేఖ భాయ్, అంజద్, హైమద్, అంజద్, హనుమాన్ భాయ్, గంగా బాయ్, సారు బాయ్, దత్తు, రజాక, మద్నూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ, కారోబర్లు, వాటర్ మెన్, ట్రాక్టర్ డ్రైవర్, ఎలక్ట్రిషన్ మ్యాన్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.