నవతెలంగాణ-హైదరాబాద్ : జనగామలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు. జనగామను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. జనగామలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. కొన్ని పార్టీలు వచ్చి మాయమాటలు చెబుతాయి. ఎన్నికలు వస్తేనే కనిపించే వాళ్లను ప్రజలు నమ్మొద్దు. మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలి.” అని కేసీఆర్ ప్రజలకు సూచించారు.