2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సేవా సమితి, ఆర్జీ-3 & ఏ.పి.ఏ ఆధ్వర్యంలో రచ్చపల్లి పునరావాస కేంద్రం, రత్నాపూర్, కల్వచర్ల, సెంటినరీ కాలనీ లో మహిళలకు నిర్వహించిన వృత్తి విద్యా కోర్సులకు సెంటినరీ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ లో 14 వ తారీకు గురువారము ఉదయం 10 గంటలకు పరీక్షలు నిర్వహించినున్నట్లు ఆర్జీ-3 జిఎం ఎన్. సుధాకర రావు తెలిపారు. సింగరేణి సేవా సమితి, ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ వారి ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం, బ్యూటిషన్ సంబంధించిన కోర్సులు నేర్చుకున్న మహిళలకు ఈ పరీక్ష లను నిర్వహించడము జరుగుతుందని, ఇట్టి కోర్సులు నేర్చుకున్న మహిళలు తప్పకుండా పరీక్షకు హాజరు కాగలరని ఆయన తెలియజేశారు.