నవతెలంగాణ-మద్దిరాల
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ 15 రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక సైనికునీ వలె పనిచేసి కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోనికి వచ్చే విధంగా కృషి చేయాలని, ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని స్థానికుడైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామ్యూల్ కు ఓటు వేసి స్థానికేతరుని తరిమికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్తా కృష్ణమూర్తి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బరపటి ఉపేందర్, వాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి,తాళ్లపల్లి సురేష్, రేసు లింగన్న, మామునూరి ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.