– ఆదరించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం..
నవతెలంగాణ -పెద్దవంగర: రాష్ట్రంలో నెల రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, అప్పుడే పేదవారి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మామిండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు. మండలంలోని పోచంపల్లి, పడమటి తండా, రాజామాన్ సింగ్ తండా, అవుతాపురం, ఉప్పెరగూడెం గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డప్పు చప్పుల్లు, కోలాటాలు, బతుకమ్మ లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా పాలన సాగించిన కేసీఆర్ సర్కార్ పై ప్రజల విశ్వాసం సన్నగిల్లిందని ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంతో పాటుగా పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలైందని, కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, కేవలం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి, అప్పుల కుప్పగా మార్చిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులందరికీ ఆరు గ్యారెంటీ కార్డులు అమలుచేసి, మాట నిలబెట్టుకుంటామని పునరుద్ఘాటించారు. 9 సంవత్సరాలు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి రాబోయే 15 రోజులు నాకోసం కష్టపడండి, వచ్చే ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానని చెప్పారు. ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత నాకు వచ్చే జీతానికి కూడా పాలకుర్తి నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, సీనియర్ నాయకులు ముత్తినేని సోమేశ్వర్ రావు, కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, మాజీ జెడ్పీటీసీ జాటోత్ కమలాకర్ నాయక్, మండల యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, తోటకూరి శ్రీనివాస్ యాదవ్, జగ్గా నాయక్, బానోత్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు రంగు మురళి, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, పన్నీరు వేణు, ఓరుగంటి సతీష్, అనపురం వినోద్, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, స్వామి, గద్దల ఉప్పలయ్య, కందుల యాకరాజు, చిలుక సంపత్, ఓరుగంటి చంద్రమౌళి, సుంకరి రమేష్, చెరుకు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.