– కాంగ్రెస్, బిజెపి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు
– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్
లీడర్, క్యాడర్ లేని ఎలక్షన్ టూరిస్ట్ ల మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని హుస్నాబాద్ ఎమ్మెల్యే బి అర్ ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో 2, 4,17 వార్డులో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటేసి తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.సతీష్ కుమార్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మంగళహారతులతో, కోలాటాలతో, బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. సతీష్ కుమార్ ను పూలమాలలు సత్కరిస్తూ వేసి శాలువాలు కప్పి మద్దతు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసిఆరే నని, కాంగ్రెస్ బిజెపి పార్టీల ముఖ్యమంత్రి ఎవరో చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నాయకులను సతీష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరొకసారి పట్టం కడతారని సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014కు ముందు హుస్నాబాద్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని ,ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారిందని ,వేలకోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసామని అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని సతీష్ కుమార్ ప్రజలను కోరారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ క కేసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరుతో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుంది ఈ పథకం వల్ల 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది, అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్న బియ్యం పంపిణీ , ఆసరా పెన్షన్ 5016 దివ్యాంగులకు రూపాయలు 6000 రూపాయలు దశలవారీగా పెంచుతామని కేసిఆర్ ప్రకటించారు, రైతుబంధు పథకం కింద ఎకరానికి 16,000 రూపాయలు, మహిళా సమైక్యలకు సొంత భవనాలు, రాష్ట్రంలోని అనాధల కోసం ప్రత్యేక పాలసీ, జర్నలిస్టులకు 15 లక్షల నగదు రహిత వైద్య బీమా, కేసిఆర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా బీమాపరిమితి 15 లక్షలకు పెంపు, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయలు జీవన భృతి, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇవ్వనున్నారు, అగ్రవర్ణ పేదలకు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు ఏర్పాటు చేస్తామని కేసిఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు, అలాగే మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలను డిగ్రీ కళాశాలలుగా అప్గ్రేట్ చేస్తామని, సిపిఎస్ ఉద్యోగులకు ఓపిఎస్ వర్తింప చేస్తామని, అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేస్తామని 2023 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కేసిఆర్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అన్వర్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న,వైస్ చైర్మన్ అనిత రెడ్డి, కౌన్సిలర్లు బోజు రమాదేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.