![గోదావరి వదరను పరిశీిస్తున్ డీఎస్ప శోభన్](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/DSP-SOBHAN.jpg)
నవతెలంగాణ-మంగపేట :
మండలంలోని గోదావరి నది వరద ఉద్రుతిని ములుగు జిల్లా డీసీఆర్బీ డిఎస్పీ శోభన్ కుమార్, ఎస్సై రవికుమార్ తో కలిసి పరిశీలించారు. శుక్రవారం మండలంలో పర్యటించిన డీఎస్పీ కమలాపురం ఇంటెక్వెల్, మంగపేట పుష్కరఘాట్, గౌరారంవాగు సహాయక చర్యలు నర్సాపురం బోరు రైస్ మిల్ ప్రాంతంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి గోదావరి వరద ముంపును అంచనా వేసినట్లు తెలిపారు. గోదావరి ఎగువన ఉన్న పలు ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేయడంతో వరద గోదావరి ప్రవహిస్తున్నదని దిగువన ఉన్న ప్రాంతాలను అప్పమత్తం చేయడం కోసం మండలంలో పర్యటించినట్లు తెలిపారు. మండలంలోని నష్టాన్ని పరిశీలించి ఎలాంటి సహాక చర్యలు అవసరమున్నదనే విషయంలో ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు తెలిపారు. మండల ప్రజలు గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.