– కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవ తెలంగాణ- వలిగొండ రూరల్
అణగారిన వర్గాల అభివృద్ధి,సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.భువనగిరి శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని లోతుకుంట, గొల్నేపల్లి, దాసిరెడ్డిగూడెం, రెడ్లరేపాక, కంచనపల్లి, మాధవనగర్, పహిల్వాన్ పురం,గ్రామాల్లో స్థానిక నాయకులతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాల కాలంగా భువనగిరి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల కుటుంబాలే అభివృద్ధి చెందిన విషయం ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు ఇల్లు, అరు గ్యారంటీ స్కిములను అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు వాకిటి అనంత రెడ్డి, ఎంపీటీసీ బెలిద నాగేశ్వర్, కసుబ శ్రీనివాస్ రావు, బాతరాజు బాల నర్సింహ, పాశం సత్తిరెడ్డి, ఉలిపే మల్లేశం, బడుగు సత్యనారాయణ, కందాల రామకృష్ణా రెడ్డి, బోళ్ల శ్రీనివాస్, పబ్బు ఉపేందర్ బోస్, చిలుగురి సత్తిరెడ్డి, గరిసే రవి, పల్లెర్ల రాజు, దేశబోయిన బాలస్వామి, జంగం శంకరయ్య, కందుల నరేష్, జాని, యాదయ్య, రేసు బుచ్చిరెడ్డి, జంగారెడ్డి, డేగల అంజయ్య, స్వామి, శ్రీకాంత్, వనగంటి రమేష్, నాగరాజు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.