– బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి
– ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో విస్త్రుత ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్
ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమనగల్, కడ్తాల్ మండల కేంద్రాలతో పాటు ముద్విన్ గ్రామంలో ఆయన మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని పదవులతో సంబంధం లేకుండా నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా గత 35 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తున్న తనను ఒకసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో రెండు పర్యాయాలు అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన తనను ప్రస్తుత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆచారి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, తాలూకా కోకన్వినర్ గోరటి నర్సింహ, మండల అధ్యక్షులు మన్య నాయక్, శ్రీకాంత్ సింగ్, జిల్లా నాయకులు రాందాస్ నాయక్, సాయిలాల్ నాయక్, రెడ్యా నాయక్, వీరయ్య, మొక్తాల వెంకటయ్య, కేకే శ్రీను ముదిరాజ్, రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.