ధమ్మా చక్ర పరివర్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని హస కొత్తూర్ లో శనివారం బుద్ధ ధమ్మా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీహార్ బుద్ధగాయా నుండి ఆలిండియా బుద్ధ సోసైటీ సంఘం సభ్యులు, విపశ్యన అధ్యాపకులు బంతే సత్యబోధి, నాగపూర్ బంతే బుద్ధరతన్ లు మార్గదర్శకులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంతే సత్యబోధి మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు దేవుడికి, ఆత్మకు పూజలు కర్మకాండలకు సంబందించినవి కావన్నారు. మరణానంతరం జీవితానికి సంబందించినవి కూడా కావన్నారు. బౌద్దానికి కేంద్ర బిందువు మనిషి, మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన సంబందాన్ని గురించే చెప్పేదే బౌద్ధం అన్నారు. దుఃఖన్ని గుర్తించడం దాన్ని తొలగించే మార్గాన్ని చూపడమే బౌద్ధధర్మ లక్షణమని పేర్కొన్నారు. మనుషులు పేదరికం కష్ట దుఃఖాలతో సతమతమౌతు జీవిస్తున్నారని, వాటినుండి బయట పడాలంటే ధర్మమార్గాన్ని, న్యాయమార్గాన్ని అనుసరించాలని ఆనాడే బుద్ధ భగవానుడు చెప్పడని వివరించారు. విపశ్యన అనేది ధ్యానములో అoతర్ముఖుడై మనసులో వికారాలను తొలగించుకొని, మనిషి దుఃఖ నివృత్తి తెలుసుకో గలుగతాడన్నారు. విపశ్యన మంచి భావంతో సంకల్పంతో శీల సమాధిలను అభ్యాసం చేసిన వారికీ ప్రజ్ఞ లభించడానికి విపశ్యన తంత్రం సాయపడుతుందని తెలిపారు. తనను తాను జాయించిన వారిని ప్రపంచoలో ఎవరు జయించలేరన్నారు. ఎలాంటి మత పరమైనా బోధనలతో సంబందo లేకుండా మానసిక సంయమనాన్ని, ప్రేమను బుద్ధుడు బోధించాడని చెప్పారు. ఈ సందర్భంగా మార్గదర్శకులు తమ వెంట తెచ్చిన బుద్ధ విగ్రహలు, బోధివృక్షo ఆకులు, బోధి కర్రలు అంబేడ్కరైట్ కార్యకర్తలకు బహుకరించారు. స్థానికులు అథితులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.