పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ 

నవతెలంగాణ -కమ్మర్ పల్లి:
మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయతీ సిబ్బందికి గురువారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ మేరకు  గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ సక్కారం అశోక్  చేతుల మీదుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులను అందజేశారు. సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ నిధుల నుండి సిబ్బందికి కానుకగా నూతన  వస్త్రాలు అందించినట్లు తెలిపారు. పదిమంది పంచాయతీ  సిబ్బందికి రెండు జతల చొప్పున దుస్తులను అందించినట్లు ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా నూతన దుస్తులను అందజేసిన సర్పంచ్ అశోక్, పంచాయతీ పాలకవర్గం సభ్యులకు పంచాయతీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కస్తూరి విక్రమ్, వార్డు సభ్యులు గణేష్, సాగర్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బైకానీ మహేష్, నాయకులు తోట అప్పయ్య, నెల్ల రమేష్, సక్కారం నారాయణ, కొత్తూర్ మహేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.