నవతెలంగాణ-పెన్ పహాడ్ : నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలకు సిద్ధమవుతున్న మండల పరిధిలోని లింగాల గ్రామంలోని జెడ్పి ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, నోటు పుస్తకాలు, పెన్నులను “నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్” సహకారంతో విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి గురువారం అండవేహరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ తరుపున పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, ఐఐటీ, ఎన్ఐటి లలో చదివిన విద్యార్థులతో ట్యూషన్, అలాగే పాఠశాలలో తెలివైన విద్యార్థులకు అన్ని రకాలుగా గైడెన్స్ మరియు సపోర్ట్ ఉంటుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోహన్ చెప్పినట్లు తెలియజేసారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఫౌండేషన్ సహకారాన్ని వినియోగించుకోని వృధ్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం శ్రీశైలం, వెంకన్న, శోభన, కోటేశ్వరరావు, జ్యోతిర్మయి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.