నవతెలంగాణ – ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 88 పాయింట్లు లాభపడి 65,305 వద్ద.. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 19,427 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 83.07 వద్ద ఉంది. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, ఐషర్ మోటర్స్, టీసీఎస్ షేర్ల విలువ కుంగింది.