నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతరంఆమె వెల్లడిస్తూ.. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్ & మెడికల్లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. ఫలితాల్లో ఏపీ విద్యార్థులు కూడా సత్తా చాటారని తెలిపారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల్లోని టాప్ 5లో నలుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే కావడం గమనార్హం.
ఇంజినీరింగ్ టాపర్లు ..
1. సనపల అనిరుధ్ (విశాఖపట్నం)
2. ఎక్కింటిపాని వెంకట మణిందర్ రెడ్డి (గుంటూరు)
3. చల్లా ఉమేశ్ వరుణ్ (నందిగామ)
4. అభినీత్ మాజేటి (కొండాపూర్)
5. పొన్నతోట ప్రమోద్కుమార్రెడ్డి (తాడిపత్రి)
6. మారదన ధీరజ్(విశాఖపట్టణం)
7. వడ్డే శాన్విత(నల్లగొండ)
8. బోయిన సంజన(శ్రీకాకుళం)
9. నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి(నంద్యాల)
10. మీసాల ప్రణతి శ్రీజ(విజయనగరం)
అగ్రికల్చర్&మెడికల్ టాపర్లు..
1. బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ (తూర్పుగోదావరి జిల్లా)
2. నశిక వెంకటతేజ (చీరాల)
3. సఫల్లక్ష్మి పసుపులేటి (సరూర్నగర్)
4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి)
5. బోర వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)
6. దేవగుడి గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)
7. వంగీపురం హర్షిల్ సాయి(నెల్లూరు)
8. దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి(గుంటూరు)
9. గంధమనేని గిరి వర్షిత(అనంతపురం)
10. కోళ్లబత్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైదరాబాద్)
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం..
పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు – 1,53,890
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు – 51,461
పరీక్షకు హాజరైన విద్యార్థులు – 1,95,275
ఉత్తీర్ణత సాధించినవారు – 1,57,879
ఉత్తీర్ణత శాతం – 80%
బాలురు ఉత్తీర్ణత శాతం – 79%
బాలికల ఉత్తీర్ణత శాతం – 82%
ఎంసెట్ అగ్రికల్చర్- మెడికల్ విభాగాలు..
పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు – 94,589
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు – 20,743
పరీక్షకు హాజరైన విద్యార్థులు – 1,01,544
ఉత్తీర్ణత సాధించినవారు – 91,935
ఉత్తీర్ణత శాతం – 86%
బాలురు ఉత్తీర్ణత శాతం – 84%
బాలికల ఉత్తీర్ణత శాతం – 87%