నవతెలంగాణ – అండమాన్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ఈ రోజు తెల్లవారుజామున 2.56 గంటల సమయంలో పోర్టుబ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. పోర్టుబ్లేయిర్కు 112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు పేర్కొంది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం..
6:44 am