– బిఅర్ఎస్ పార్టి జిల్లా అధ్యక్షులు తోట అగయ్య
నవతెలంగాణ-వీర్నపల్లి : ప్రతి కార్యకర్త కేటీఆర్ కు భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషీ చేయలని బిఅర్ ఎస్ పార్టి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో గురువారం బి అర్ ఎస్ పార్టి జిల్లా అధ్యక్షులు తోట అగయ్య పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి కార్యకర్తకు దిశ నిర్దేశం చేసి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఓటరుకు తెలియజేయలన్నరు . కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ సిరిసిల్ల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టి అభ్యర్థి కేటీఆర్ గెలిపించడానికి బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దినకర్, ఎ ఎం సి వైస్ చైర్మన్ తులసిరామ్, డైరెక్టరు దేవేందర్, రాజు, రమేష్, ఉప సర్పంచ్ లు రాములు, తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు నాగ రాజు, నాయకులు సంతోష్ నాయక్, శ్రీరామ్ నాయక్, బాబూ, అజెయ్, నాంపల్లి భూపతి, రాజు కుమార్ ఉన్నారు.