నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల నేపథ్యంలో తేది 9.10.2023 నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుండి రామన్నపేట ఎక్సైజ్, ప్రొహిబిషన్ డివిజన్ పరిధిలో చౌటుప్పల్, రామన్నపేట, నారాయణపురం మండలాల్లో విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది.3 మండలాల పరిధిలో ఎక్సైజ్ మొబైల్ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేశారు. తనిఖీలలో భాగంగా 112 మద్యం కేసులు నమోదు చేసి 26 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. 112 లీటర్ల మద్యం 85 లీటర్ల బీరు వీటితోపాటు 3 లక్షల 75 వేల విలువగల ఒక కారు 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.వీటితోపాటు 25,445 లీటర్ల కల్లు 18,720 లీటర్ల బెల్లం పానకం 94 లీటర్ల నాటు సారాయి 3.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాము.స్వాధీనం చేసుకున్న మొత్తం 44,59,231 లక్షల రూపాయల విలువ ఉంటుందని సిఐ జి.నాగలత చెప్పారు. శుక్రవారం చిన్న కొండూరు గ్రామంలో 5.4 లీటర్ల మద్యం,7.8 లీటర్ల బీరు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని రామన్నపేట ఎక్సైజ్, ప్రొహిబిషన్ సిఐ.జి.నాగలత తెలిపారు.