నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఆదివారం రాత్రికురిసిన భారీవర్షానికి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం ఉదయం గాంధారి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే సురేందర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆధార్య పడవద్దని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ సభ్యులు శంకర్ నాయక్, ఏ ఏం సి చెర్మెన్ సత్యంరావు, సొసైటీ చెర్మెన్ సాయికుమార్, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.