నవతెలంగాణ – పంజాబ్: పంజాబ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం ఈ రోజు జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చారు. పాక్ సరిహద్దుల్లో చొరబాటుదారుడి కదలికలు పనిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. చొరబాటుదారులు సరిహద్దు కంచెకు దగ్గరగా వెళ్లడంతో సైనికులు వారిపై కాల్పులు జరిపారు. పంజాబ్లోని తార్న్ తరన్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్ వ్యక్తులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. పాకిస్థాన్కు చెందిన ఇద్దరు గుర్తుతెలియని చొరబాటుదారులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హతమార్చింది. వారు భారత భూభాగంలోకి ప్రవేశించి ఈ నెల మే నెలలో భారతదేశం-పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా మూడు ప్యాకేట్ల నిషేదిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాట్లు చెప్పారు. అదే నెలలో పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఒక పాకిస్థానీ జాతీయుడిని బీఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ ఫ్రాంటియర్లోని బీఎస్ఎఫ్ సైనికులు సరిహద్దు దాటి పంపిన 22 డ్రోన్లను హస్తగతం చేసుకున్నారు.