నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించడంతో అధికారులు పంపిణీ ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఏటా ప్రభుత్వం రైతులకు వానకా లం పంటకు రూ.5వేలు, యాసంగి పంటకు రూ.5వేల చొప్పున ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సాయం అందిస్తున్నది. తొలివిడుతలో చిన్న, సన్నకారు రైతుల్లో సొ మ్ము జమ కానుంది. వానకాలం పంట పెట్టుబడికి రైతుబంధు పథకాన్ని అర్హులకు వర్తింపజేసేందుకు కార్యాచరణ రూపొందించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి తొలి విడుతలో చిన్న, సన్నకారు రైతుల నుంచి మొదలు నిర్ణీత గడువులోగా అందరి ఖాతాల్లో నేరుగా రైతుబంధు సాయాన్ని జమ చేస్తాం. ఈ నెల 16 వరకు పట్టాదారు పాస్ పుస్తకం వచ్చి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోని రైతులు సంబంధిత ఏఈవోలను సంప్రదించాలలి. ఏఈవోలకు పట్టా పాస్ బుక్, ఆధార్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్లను దరఖాస్తు ఫారంకు జతచేసి ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.