– రైతులను నిర్బంధించి మరీ నిర్వహణ
– సీపీఐ(ఎం) నేతలు, నిర్వాసితుల అరెస్ట్
– అరెస్టులను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
నాగపూర్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అంశం నాలుగేళ్లుగా ఖమ్మం జిల్లా నిర్వాసితుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. నిర్బంధం, అరెస్టులు మధ్య శనివారం రఘునాథపాలెం మండలంలో బలవంతంగా సర్వే నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా పోలీసులను మోహరించి రైతులను నిర్బంధించారు. సీపీఐ(ఎం) నేతలను అరెస్టు చేశారు. విలువైన భూములు, ప్లాట్లు, ఖమ్మం నగర విస్తరణకు ప్రధాన ఆటంకంగా ఉన్న ఈ రహదారి అలైన్మెంట్ మార్చాలని ఇప్పటికీ పలుమార్లు రైతులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ జరిగినా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 2019 నుంచి ఈ తంతు కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యంగానైనా ఈ రహదారి నిర్మించాలనే పట్టుదల కనబరుస్తోంది. రూ. కోట్ల విలువైన భూములకు . లక్షల్లో పరిహారం ఇచ్చి బలవంతంగా లాక్కోవాలనే యోచనతో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తోంది. నగరాన్ని, నూతన కలెక్టరేట్ను వేరు చేస్తున్న ఈ రహదారి నిర్మాణం అలైస్మెంట్ మార్చాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మంత్రి పువ్వాడ అజయ్ ఎంపి నామ నాగేశ్వరరావుకు సీపీఐ(ఎం) పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. అలైన్మెంట్ మార్చినట్టు కలెక్టర్ ఇటీవల సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుకు తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం ఇదే విషయాన్ని తమకు వెల్లడించినట్టు నిర్వాసితులు చెబుతున్నారు.
బలవంతపు సర్వేపై పెల్లుబిక్కిన నిరసన: గత నెల 25న చింతకాని మండలం కొదుమూరు, వందనం
గ్రామాల్లో ఎలాగైతే బలవంతంగా సర్వే నిర్వహించారో శనివారం . రఘునాథపాలెం మండలంలోనూ అదే పునరావృతం చేశారు. మండల కేంద్రంతోపాటు కామంచికల్, రేగులచలక, కోయచలక, బల్లేపల్లి, వివిపాలెంలో సర్వే నిర్వహించేందుకు ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటలకే సుమారు 600 మంది పోలీసులు గ్రామాలను చుట్టుముట్టారు. ముఖ్యమైన రైతులను నిర్బంధించారు. విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సంగబత్తుల నవీస్ రెడ్డితో పాటు 30 మంది రైతులను రఘునాథపాలెం సెంటర్లో అరెస్టు చేశారు. ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, కామేపల్లి పోలీసుస్టేషన్లకు వీరిని తరలించారు. రాంబాబు, నవీన్ లను అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేయాలని ప్రయత్నించారు. విషయం తెలిసి నిర్వాసితులు ఆందోళనకు పూనుకోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. నేతలు, నిర్వాసితుల అక్రమ అరెస్టును ఖండిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను ఖమ్మంలోని సరితా. క్లినిక్ సెంటర్లో దహనం చేశారు.
రైతుల సమక్షంలో సర్వే చేసినట్టు చిత్రీకరించే యత్నం
రైతుల సమక్షంలోనే సర్వే చేసినట్టు చిత్రీకరించే యత్నంలో భాగంగా నిర్బంధంలో ఉన్న నిర్వాసితులను పోలీసులు తమ భూముల వద్దకు తీసుకెళ్లి ఫొటోలు తీసుకొచ్చేందుకు పూనుకున్నారు. రైతులు ప్రతిఘటించడంతో ఆ చర్యను విరమించుకున్నారు. కనీసం తమ సమస్యను సర్వే అధికారులకు చెప్పుకుంటా మన్నా వినకుండా బలవంతంగా సర్వే కొనసాగించారని రైతులు వాపోతున్నారు. పోలీసుస్టేషన్లలో ఉన్న రైతులను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, వై. విక్రమ్, కాంగ్రెస్ నేతలు ముక్కా శేఖర్ గౌడ్, కార్పొరేటర్ మలీద్ వెంకటేశ్వర్లు, మార్గం కరుణాకర్ రెడ్డి తదితరులు పరామర్శించారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే అంశంపై రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని, అలైన్మెంట్ మార్చాలి.. లేదంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మెన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా మంత్రి మౌనం వీడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వేలో జిల్లా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఎన్హెచ్ పీడీ దుర్గాప్రసాద్, పలువురు తహశీల్దార్లు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.
అన్మెంట్ మార్చామంటూనే దౌర్జన్యం
అలైన్మెంట్ మార్చారని మంత్రి, కలెక్టర్ మాతో చెబుతున్నారు. శు రెడ్డి ఫోన్లను క్రవారం ఇదే విషయమై క్యాంప్ ఆఫీసుకు వెళ్లి మంత్రిని కలిశాం. ఆ తర్వాత కూడా పలుమార్లు ఫోన్ చేశాం. ఆయన భరోసా ఇవ్వడంతో ప్రశాంతంగా ఉన్నాం: తెల్లవారేలోగా సర్వే అధికారులు రావడం… మమల్ని అరెస్టు చేయడం ఆగమేఘాల మీద జరిగాయి. మాకు అండగా ఉంటున్న సీపీఐ(ఎం) నేతలనూ అరెస్టు చేశారు. మంత్రి స్పందించి. న్యాయం చేయాలి.
– తక్కెళ్లపాటి భద్రయ్య, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతు
నోటిఫికేషన్లు ఇస్తున్నా లొంగట్లేదనే…మండలంలో 1200 మంది నిర్వాసితులకు చెందిన 260 ఎకరాల భూములు, మల్లెమడుగు, బల్లేపల్లిలో వందలాది ప్లాట్లు హైవే కింద పోతున్నాయి. వీటి సేకరణకు సీపీఐ(ఎం) ఆటంకంగా మారింది. రైతుల పక్షాన ఉన్నామని మమ్మల్ని అరెస్టు చేశారు. ఇప్పటికీ మూడుసార్లు. నోటిఫికేషన్లు ఇచ్చినా వృథాప్రయాసే అవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణలోనూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్న నోటిఫికేషన్ గడువు కూడా సెప్టెంబర్ 17తో ముగుస్తుండటంతో ఇలా దౌర్జన్యంగా సర్వే చేశారు.
– ఎస్. నవీన్ రెడ్డి: సిపిఎం రఘునాథపాలెం మండల కార్యదర్శి