– బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య
– ఊరూరా సండ్రకుకు ఘన స్వాగతం
నవతెలంగాణ-పెనుబల్లి
సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి శక్తి వంచన లేకుండ అభివృద్ధి ఫలాలను అందించానని, మరింత అభివృద్ధికి తమ ఓటు ద్వారా అవకాశం కల్పించాలని బిఆర్ఎస్ సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఓటర్లను అభ్యర్థించారు. గురువారం పెనుబల్లి మండలంలో అడివిమల్లెల, కోండ్రుపాడు, సూరయ్య బంజర్ పాత, కొత్త కారాయి గూడెం, గణేష్ పాడు, మరలకుంట కందిమల్ల వారి బంజర్లో ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మేళ తాళాలతో, పూల మాలలతో సండ్రాకు ఘన స్వాగతం పలికారు. దళిత బంధు పథకంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన హామీలను ఎన్నికల తర్వాత అమలుపరచుకుంటూ పోతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలుపరిచి చూపుతామని తెలి పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కానీ హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు, మందడపు అశోక్కుమార్, తాళ్లూరు శేఖర్రావు, బెల్లంకొండ చలపతి, నరుకుల్ల సత్యనారాయణ, చింతనిపు సత్యనారాయణ, చీకటి మోహన్రావు దొడ్డపనేని రవి శ్రీదేవి పాల్గొన్నారు.
సండ్ర గెలుపు కోసం
ఎంపీ బండి పార్థ సారధిరెడ్డి ప్రచారం
తల్లాడ : సత్తుపల్లి నియోజకవర్గ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ తల్లాడ మండలంలో గురువారం ఎంపీ బండి పార్థసారధిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి నియోజక వర్గంలో మౌలిక నెలకి సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేశారని, నియోజకవర్గ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తల్లాడ, పినపాక, ముద్దనూరు ,కలకోడి మా, బస్వాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తల్లాడ పట్టణంలో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తల్లాడ పట్టణంలో ముస్లిం, కబరస్తాన్ అభివృద్ధి కోసం సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ప్రయోజనం పొందేలా సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ మీ కుటుంబ సభ్యునిగా ఉండే సండ్ర వెంకట వీరయ్యను ఈ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పిటిసి సభ్యురాలు దేశాల ప్రమీల, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డి. బద్దరాజు, వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకటలాల్, మండల కోఆప్షన్, సభ్యుడు షేక్ యూసఫ్, సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి అభివృద్ధి జరగాలంటే ‘సండ్ర’కే ఓటెయ్యండి
– ప్రచారంలో సండ్ర సతీమణి మహాలక్ష్మి
సత్తుపల్లి : సత్తుపల్లి అభివృద్ధి పరుగులు తీయాలంటే బీఆర్ఎస్ తరపున సత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్న సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని సండ్ర సతీమణి మహాలక్ష్మి పట్టణ ప్రజలను కోరారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 19, 23 వార్డుల్లో మహాలక్ష్మి బీఆర్ఎస్ శ్రేణులను వెంట తీసుకొని ఆయా వార్డుల పరిధిలోని వీధుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ముద్రించిన కరపత్రాలను పంచారు. అందులో పొందుపర్చిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, తులసి, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, మాధురి, ఆత్మ ఛైర్మెన్ వనమా శ్రీనివాసుదేవరావు, కౌన్సిలర్లు అమరవరపు విజయనిర్మల, మేకల భవాని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, నాయకులు అమరవరపు కృష్ణారావు, మానుకోట సత్యనారాయణ, ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.