హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ డాక్టర్ నౌహెరా షేక్
నవతెలంగాణ-హిమాయత్నగర్
రూ.లక్ష కోట్ల విలువైన హీరా గ్రూప్ కంపెనీపై అసత్య ప్రచారాలు నమ్మి ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దనీ, పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ తాను అండగా నిలబడతానని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ డాక్టర్ నౌహెరా షేక్ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హీరా గ్రూప్ అనేది సమకాలీన ప్రపంచంలో నమ్మకం, విశ్వాసానికి పర్యాయపదం అన్నారు. తనపై నమ్మకం ఉంచాలని హీరా గ్రూప్ పెట్టుబడిదారులకు పోస్ట్-రిలీజ్ స్టేట్మెంట్లో వాగ్దానం చేశామన్నారు. కొద్ది రోజుల సమయం ఇస్తే ప్రతి పెట్టుబడిదారుడికీ తిరిగి చెల్లిస్తామని తెలిపారు. ఇన్వెస్టర్లకు గతంలో తాను ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి హీరా గ్రూప్ 50 వేల కంటే ఎక్కువ పెట్టుబడిదారులకు డేటా లేకుండా తిరిగి చెల్లించిందన్నారు. అయినప్పటికీ, ప్రతి పెట్టుబడిదారుడికీ నాలుగు వాయిదాల్లో 16 నెలల్లోపు తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేసినందున, హీరా గ్రూప్ కంపెనీలపై విశ్వాసం ఉంచినందుకు మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతలో ట్రోల్స్, నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా పెట్టుబడిదారులను కొందరు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారని తెలిపారు. చాలా మంది పెట్టుబడిదారులు కంపెనీలో కనీసం వాటాను పొందడానికి సుప్రీంకోర్టు సెక్యూరిటీ విలువను డిపాజిట్ చేయడానికి వెల్లువెత్తుతున్నారని తెలిపారు. కంపెనీ నికర విలువను లెక్కించడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు. హీరా గ్రూప్ నికర విలువను కొన్ని ఏజెన్సీలు రూ.1 లక్ష కోట్లు అని అంచనా వేశాయని తెలిపారు. నౌహెరా షేక్ ఆపేలో ఇన్వెస్టర్లందరికీ ఒకే ఇన్స్టాల్మెంట్లో తిరిగి చెల్లించడానికి తన వద్ద తగినంత వనరులు ఉన్నాయన్నారు. కానీ ప్రతిదానికీ ఒక విధానం ఉంటుందనీ, చట్టాన్ని గౌరవించే పౌరులుగా దేశం నిర్దిష్ట నియమాలు, నిబంధనలను అనుసరించాలనీ, ఏ చట్టాన్ని ఎప్పుడూ ఉల్లంఘించబోనని చెప్పారు. ఇన్వెస్టర్ల డేటాను అందజేయాలని భారత సుప్రీంకోర్టు ఆదేశించిందనీ, కానీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు.