నవతెలంగాణ- చండూరు: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ని గెలిపించాలంటూ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి గట్టుపల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచార నిర్వహించారు. గట్టుప్పల్ మండలం శేరిగూడెం, కమ్మ గూడెం, తెరట్పల్లి, వెల్మ కన్నె గ్రామాలలో ప్రచారానికి వెళ్లిన కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను గడపగడపకు తిరుగుతూ వాటిని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి మంచి మనిషిని వదులుకోవద్దని మునుగోడు ప్రజలు కష్ట కాలంలో కరోనాకాలంలో ఉన్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. మీరు గెలిపిస్తే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే అంత గొప్ప మనస్తత్వం కలవాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయి గుర్తు పై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట మహిళలు పాల్గొన్నారు.