నవతెలంగాణ -వలిగొండ : మండలంలోని రెడ్లరేపాకకు చెందిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి, ఎంపిటిసి నోముల మల్లేష్ ఆధ్వర్యంలో సుమారుగా 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో టేకులసోమారంలోని ఎంఎంఎస్ గార్డెన్ లో కాంగ్రెస్ లో గురువారం చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మండలంలోని కేర్చిపల్లి అనిల్ కుమార్ రెడ్డి సోదరీమణులు విజయ లక్ష్మి, ఝాన్సీ లు వారి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఎం తుర్కపెల్లిలో మాజీ ఎంపిటిసి పలుసం సతీష్ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ రెడ్డి గెలుపుకై ఇంటిoటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఆరూర్ లో వాకిటి అనంత రెడ్డి ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ , తంగళ్ళపల్లి రవి కుమార్, బాథరాజు బాల నర్సింహా, తుమ్మల యుగంధర్ రెడ్డి, చేగూరి మల్లేశం,పాశం సత్తి రెడ్డి, గరిసె రవి, బోళ్ల శ్రీనివాస్, బత్తిని సహదేవ, కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు.