నవతెలంగాణ- అశ్వారావుపేట: ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మన తెలంగాణ అభివృద్ధి అద్భుతంగా ఉందని, అవసరమైన సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు అని బీఆర్ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఉప్పల వెంకట రమణ అన్నారు. ఓట్లు కోసం మభ్య పెట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసింది చెపుతున్నామని అన్నారు. స్థానిక పార్టీ ఎన్నికల కార్యాలయం లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడరు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పధకాలు చాలా బాగున్నాయని ఆంధ్ర పాలకులు అంగీకరిస్తూ తలలు దించుకుంటున్నారని చెప్పారు. ప్రగతి లో తెలంగాణ ఉన్నత స్థితిలో ఉంటే ప్రక్క రాష్ట్రం అట్టడుగున ఉందని వివరించారు.ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం ను గిరిజనులు సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారని,ఆయన నినాదం మేరకు గిరిజనులకు కావాల్సిన పోడు పట్టులు, కొత్త గ్రామ పంచాయితీల ద్వారా స్వయం పాలన, అస్థిత్వం పెంపుతో పాటు తగిన గౌరవం అందించటంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమాన్ని అందించినట్టు ఉదాహరించారు.అలాగే గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు సోదర భావంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని, అందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కేసీఆర్ దృష్టి సారించటమేనని అన్నారు. సామరస్యపూర్వక వాతావరణం కొనసాగించేలా ఓటర్లు బీఆర్ఎస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణను పామాయిల్ హబ్ గా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, సమైక్య రాష్ట్రంలో కేవలం 2,500 ఎకరాలు ఉన్న ఆయిల్ ఫాం తోటలు ప్రస్తుతం 25 వేల ఎకరాలకు పెరిగిందని, సాగు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపటమే ఇందుకు కారణమని తిన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు పట్లనే ఆయిల్ పాం ధర పతనమైందని, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే అయిల్ ఫాం పై పన్నును పూర్తిగా ఎత్తిచేయటంతో గెలల ధర పడిపోయిందని తెలిపారు. అయినప్పటికీ పామాయిల్ రైతులను కాపాడుకోవటానికి కనీస మద్దతు ధర ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, టన్ను గెలల ధర రూ.15 వేలు నుండి రూ.10 వేల కు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నా పామాయిల్ రైతులను రక్షించుచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తించినట్లు స్పష్టం చేశారు. ఆయిల్ రిఫైనరీ యూనట్ ఇక్కడ నుండి సిద్దిపేటకు తరలిపోవటం లేదని, మొదటి ప్రాధాన్యత అశ్వారావుపేటకే ఉంటుందని అన్నారు. నర్సరీల్లో ఆంద్రా ప్రాంతంలోని కడియం కంటే తెలంగాణలో నాణ్యమైన మంచి రకాల మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని నర్సరీలకు కూడా రైతులకు ఇస్తున్నట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను ఇక రెప్పాల్సిన అవసరం లేదని, ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని, ప్రతి. గ్రామంలోనూ అభివృద్ధి బాటలు ఉన్నాయని చెప్పారు. మరింత అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ నెల 30 వ తేదీన జరిగి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావును కారు గుర్తుపై టు చేసి లిపించాలని కోరారు. సమావేశంలో రైతుబంధు జిల్లా అవ్యక్షులు రావు జోగేశ్వరరావు, ఎంపీపీ అల్లిపల్లి శ్రీరామ్మూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సరిగ్గా ప్రసాద్, సర్పంచ్ సంఘం అధ్యక్షులు సారం రాజశేఖర్, లిలర్ఎస్ నాయకులు కోటగిరి సీతారామస్వామి. జీవీ రమణారావు, జుజ్జూరు వెంకన్నబాబు, సత్యవరపు సంపూర్ణ, మందపాటి రాజమోహన్ రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, చిన్నంశెట్టి వంకటనరసింహం, తాడేపల్లి రవి, సోమాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.