నవతెలంగాణ – కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని పేట్బషీరాబాద్లో గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి చెందాడు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కుశాల్.. హాస్టల్లో హార్ట్ఎటాక్తో మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలోని మైసమ్మగూడలో కుశాల్ ఉంటున్నాడు. అక్కడ హాస్టల్లో ఉంటూ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి బాత్రూంలో కుప్పకూలాడు. మూత్ర విసర్జన సమయంలో గుండె నొప్పి రావడంతో కుశాల్ మరణించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ అస్పత్రికి తరలించారు.