హైదరాబాద్ : 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి (ఇంటర్ డిస్ట్రిక్) టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో త్రిశూల్ మెహ్రా స్వర్ణం సాధించాడు. సికింద్రాబాద్లోని ఓ అకాడమీలో జరిగిన ఫైనల్లో తరుణ్ కేదర్నాథ్పై 4-2తో విజయం సాధించిన త్రిశూల్ మెహ్రా అండర్-19 బార్సు విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర స్థాయి టోర్నీలో విజేతగా నిలిచిన త్రిశూల్ను కోచ్ అశ్విన్ కుమార్ జైస్వాల్ అభినందించారు.