నవతెలంగాణ-ఐడిఎ బొల్లారం
ఒక రోజు తేడాతో అనారోగ్యంతో తల్లీ కొడుకు మృతి చెందిన సంఘటన బొల్లారంలో చోటు చేసుకుంది. బీరప్ప బస్తీకి చెందిన లక్ష్మమ్మ(55) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గురువారం ఆమె కుమారుడు పున్నం (30) మృతి చెందాడు. మృతునికి భార్యా ఇద్ద రు చిన్న పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలకు డబ్బులు లేని పరిస్థితి. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు కేజేఆర్ ఆనంద కష్ణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.