నవతెలంగాణ – మేడ్చల్: జీడిమెట్ల, షాపూర్నగర్లో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు బాలానగర్ ఏసీపీ చెంద్రశేఖర్, బాలానగర్, జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్ పోలీసులు సంయుక్తంగా షాపూర్నగర్ ప్రాంతంలో ముగ్గురు ఎస్ఐలు 40 మంది కానిస్టేబుల్స్ సహయంతో మూడుచోట్ల మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కేవలం అరగంట వ్యవధిలో 32 ద్విచక్ర వాహనదారులపై డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. జైలుకు వెళ్లినా వాహనదారులు మారకపోవడంతో త్వరలో అవగాహన కార్యక్రమం చేపెడతామని జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వెంకట్ రెడ్డి వెల్లడించారు.