నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
ఇంటర్ ఫలితాల్లో జిల్లా 1st ర్యాంక్, స్టేట్ 7వ ర్యాంక్ సాధించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థి అశ్వితకు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అభినందించారు. విద్యార్థి అశ్వితపై చదువుల నిమిత్తం మంత్రి ని ల్యాప్టాప్ అడగడంతో శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యార్థికి అభినందనలు తెలిపి ల్యాప్ టాప్ అందజేశారు.