నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల నెహ్రు పార్క్ అహ్మద్ పురా కాలనీ లో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..అభివృద్ధి కి కుల మత బేధము లేదు సంక్షేమ పథకాలకు లింగ బేధం లేదు. అందరి సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయం. నిజామాబాద్ నాలుగు దిక్కుల అభివృద్ధి.
హైదరాబాద్ రోడ్డు, వర్ని రోడ్డు, ఆర్మూర్ రోడ్డు ఏ విధంగా అభివృద్ధి చేసమొ అదే తరహాలోనే బోధన్ రోడ్డు ని అభివృద్ధి చేసాము. నెహ్రు పార్క్ ని ఆధునికరించి వాటర్ ఫౌంటేన్ నిర్మాణం చేసాము.ప్రతి డివిజన్ లో సిసి రోడ్లు,డ్రైనేజి లు కల్వర్టులు నిర్మాణం చేసాము.నిజామాబాద్ నగర ప్రజల కోసం అందమైన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేసాము.నిజామాబాద్ యువత కోసం ఐటి టవర్ నిర్మాణం చేసి ఉద్యోగాలు ఇప్పించాము. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ ఏ అలీం,మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మాజాజ్ అలీ, అబ్దుల్ కుద్దుస్, బాబ్ల్యూ ఖాన్, అక్బర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.