– జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్
నవతెలంగాణ – జనగామ కలెక్టరేట్ : జాతీయ నులిపురుగుల నవారణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3 నుండి 10 వరకు మాప్ అప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 2న అన్ని వాట్సప్ గ్రూపుల్లో టామ్ టామ్, పత్రిక ప్రకటన, వాతావరణ అనుకూలతను బట్టి ర్యాలీ నిర్వహించాలని, 3న ప్రారంభ కార్యక్రమం సందర్భంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గౌరవ ప్రజాప్రతినిధులను, సంబంధిత శాఖ అధికారులను, ప్రజా సంబంధాల ప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పారు.1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర, 2 నుండి 3 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్ర చెంచాలో పొడి చేసి నీళ్ళలో కలిపి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ తాగించాలని, 3 నుండి 19 సంవత్సరాల పిల్లలకు మాత్ర నమిలి చప్పరించిన తరువాత నీరు తాగించాలని, ఎఈఎఫ్ఐ మాత్ర మింగిన తరువాత ఏ విధమైన దుష్ఫరిణామాలు వచ్చినా వెంటనే సంబంధిత ఆరోగ్య సిబ్బందికి, వైద్యాధికారికి తెలిపి దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలిని కోరారు ఆల్ఫెండోజల్ మాత్ర తీసుకున్న తరువాతనే ఆహారం ఇవ్వాలని, మాత్ర ఇంటి వద్ద వేసుకొనుటకు ఇవ్వొద్దని, ఖాళీ కడుపుతో ఉన్న వారికి ఇవ్వొద్దని, పాఠశాలలు, కళాశాలల్లో సంబంధిత ఉపాధ్యాయులు మాత్రలు మింగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.