నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ యాత్రలు నిర్వహించింది. ఈ యాత్రలు సందర్భంగా వచ్చిన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఛలో కలెక్టరేట్ ధర్నాలకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కారం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్ధి నాయకులపై పోలీసులు విక్షచణ రహితంగా దాడి చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. బలవంతంగా అరెస్టు చేసి రాత్రి వరకు అమ్మాయిలు ఉన్న సరే పోలీసు స్టేషన్ లో నిర్బందించారు. బెదిరించి కేసులు పెట్టారు. ఈ చర్యలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండిస్తుంది. తక్షణమే అక్రమ కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధులను చెదరగోట్టి అరెస్ట్ చేశారు. రౌడిల వల్లె ఈడ్చుకుంటూ వెళ్ళారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్ధులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 5,177 కోట్లు స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలి.ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు విడుదల చేయాలి. స్వంత భవనాలు నిర్మించాలి. అంతే తప్ప అక్రమంగా కేసులు పెట్టడం కాదు. విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది.నల్గొండ జిల్లాలోని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ధర్నాలు చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవరించి అక్రమ అరెస్టులు చేశారు. మెదక్, ఖమ్మం, మేడ్చల్, జనగామ, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్,వికారాబాద్,నిజామాబాద్ జిల్లాలో పోలీసులు అరెస్టులు, తోపులాటలు చేశారు. ఈ చర్యలను ఖండిస్తూ రేపు (22-08-2023) రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడానికి ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది.