నవతెలంగాణ – హైదరాబాద్: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికు రావడం తో హరీష్ రావు సమక్షం లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఅర్ భారీ బహిరంగ సభ నేపధ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి హాజరు అవడం సంతోషంగా ఉందని ఈ సందర్బంగా హరీష్ రావు పేర్కొన్నారు. జనగాంలో ఎంట్రీతోనే అద్భుతమైన విజయం సాధించే దిశగా సాగుతున్న రెడ్డి శుభాకాంక్షలు.. జనగామ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి చూశారు. తెలంగాణ ఉద్యమానికి పోరు గడ్డ జనగామ ప్రాంతం అని కొనియాడారు.