– యైటింక్లైన్ కాలనీ.01
– కార్పొరేటర్ బాధే అంజలీదేవి నిఖార్సైన నాయకురాలు
– నాతో కొట్లాడి మరీ సమస్యలు పరిష్కరించుకుంటోంది
– అల్లూరులో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
నవతెలంగాణ- యైటింక్లైన్ కాలనీ : 18వ అభివృద్ధి చేయడం నా బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం 18వ డివిజన్ లోని పోచమ్మ గుడి వద్ద 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం కంటే డివిజన్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. బాధే అంజలీదేవి నిఖార్సైన నాయకురాలని అందుకే నాతో కొట్లాడి మరీ సమస్యలు పరిష్కరించుకుంటోందని అన్నారు. మంచి నాయకులు ఉంటే మంచి సమాజాన్ని తయారు చేస్తారని దానికి 18వ డివిజనే నిదర్శనం అని అన్నారు. ఇంకా డివిజన్ లో మహిళా భవనం కావాలని ఆమె అడిగారని తప్పకుండా అతి త్వరలోనే మహిళా భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సాగంటి శంకర్, తాళ్ల అమృత, శంకర్ నాయక్ నాయకులు మారెళ్ళి మల్లారెడ్డి, ఐలీ శ్రీనివాస్, దాసరి బాలరాజు, ఎండి గౌస్ పాషా, గుడెల్లి రాంచందర్, పులి రాకేష్, జాగటి మల్లేష్, పోతుల రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.