నవతెలంగాణ -కంటేశ్వర్:
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంపూర్ణ సురక్ష హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం రెండవ పేజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ హెచ్ఐవి స్థితి తెలుసుకోవడం కోసం జిల్లా వ్యాప్తంగా హెచ్ఐవి స్థితి తెలుసుకోవడం కోసం జిల్లా వ్యాప్తంగా హెచ్ఐవి పరీక్షల కొరకు 14 సెంటర్లను ఏర్పాటు చేసి సెప్టెంబర్ నెల నుండి వచ్చే ఫిబ్రవరి వరకు పరీక్షలు చేసి పాజిటివ్లను గుర్తించి చికిత్సను అందించడం ముఖ్యం అని నిజామాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ అధికారి సుదర్శనం తెలిపారు. అందులో భాగంగా ఈ మేరకు శుక్రవారం స్థానిక జిల్లా ఆసుపత్రి బోధన్ లోని ఐ సి టి సి సెంటర్ లో సంపూర్ణ సురక్ష హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం ఫేజ్ 2 ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుదర్శనం మాట్లాడుతు.. జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మన జిల్లాలో 2021 జనాభా ప్రకారం 0.461 ప్రివలెన్స్ తో 6274 మంది కి హెచ్ఐవి సోకి ఉండవచ్చని ఒక అంచనా ను మనకు ఇచ్చారు. ఈ లెక్క ప్రకారం వారిలో 95% మందికి వారి హెచ్ఐవి స్థితి తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమమును ప్రారంభించడం జరిగిందని నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలియజేశారు.
ఇప్పటి వరకు మన జిల్లాలో ఉన్న గణాంకాలను చూస్తే 6091 మందిని గుర్తించడం జరగింది. దీనికి గాను రాష్ట్ర స్థాయి లో మొదటి స్థానం లో నిజామాబాద్ ఉండటం గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు టీబి కోఆర్డినేటర్ రవి టీబి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.